కరోనా షాక్ నుంచి ఇటలీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. మరణాల సంఖ్య గతం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ఇటలీలో గత 24 గంటల్లో 437 మంది మరణించారు , ఒక రోజు క్రితం 534 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో మరణించిన వారి సంఖ్య 25 వేలు దాటింది. చైనా నుంచి వ్యాపించిన కరోనా ఇటలీలో తీవ్ర ఆందోళన సృష్టించింది.
నాలుగు వారల కిందట వరకూ మరణాలు రోజు 7 వందలకు పైగా నమోదవుతున్నాయి. అయితే అవి క్రమంగా తగ్గుతున్నాయి. మార్చ్ 28 నుంచి మరణాల రేటు తగ్గుతూ వస్తోంది. ఇక ఇటలీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 187,327 ఉండగా ఇందులో 54,543 మంది కోలుకొని ఆసుపత్రులనుంచి డిశ్చార్జ్ అయ్యారు.