ఇండియాలో కరోనా బారిన పడి 24 గంటల్లోనే 37 మంది మృతి

Update: 2020-04-24 17:58 GMT

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. ప్రాణాంతకర వైరస్ కారణంగా 24 గంటల్లోనే 37 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వరకు 718 మంది ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశ వ్యాప్తంగా కొత్తగా 1684 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 23 వేలు దాటింది.

Similar News