సింగపూర్కు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నిత్యావసరాలతో పాటు వైద్య పరికరాలు, మందులు పంపిస్తామని సింగపూర్ ప్రధాని లీ లూంగ్ హామీ ఇచ్చారు. కరోనా వలన ఎదురౌతున్న ఆరోగ్య, ఆర్ధిక సవాళ్లపై ఇరుదేశాల ప్రధానులు చర్చించారని కార్యాలయం తెలిపింది.
అటు కరోనా నేపథ్యంలో సింగపూర్లో పనిచేస్తున్న భారతీయ పౌరులను కూడా చూసుకుంటామని సింగపూర్ ప్రధాని లీ హ్సేన్ లూంగ్ ప్రధాని నరేంద్ర మోడీకి హామీ ఇచ్చారు. సింగపూర్ అభివృద్ధిలో వలస కార్మికుల కృషి చాలా ఉందని.. వారిని కూడా సింగపూర్ వాసులు గానే చూసుకుంటామని అన్నారు.
కాగా.. కరోనా నేపథ్యంలో సింగపూర్లో లాక్డౌన్ను జూన్ ఒకటి వరకూ పొడిగించిన విషయం తెలిసింది.