తెలంగాణలో కరోనా వైరస్ వ్యాపిస్తోంది. రాష్ట్రంలో రోజు రోజుకీ కొత్త కేసులు నమోదవుతునే ఉన్నాయి. ఆదివారం కొత్తగా 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 11 పాజిటివ్ కేసులు నమోదవడం గమనార్హం. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,001కు చేరింది. ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారిన పడి 25 మంది ప్రాణాలు కోల్పోయారు.