మహారాష్ట్రకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించండి: మోదీకి శరద్ పవార్ లేఖ

Update: 2020-04-26 19:55 GMT

మహారాష్ట్రకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించి.. తమను ఆదుకోవాలని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కేంద్రాన్ని కోరారు. ప్రధాని మోదీకి లేఖ రాసిన శరద్ పవర్.. లాక్‌డౌన్ పొడగింపుతో ముంబై ఘోరంగా నష్టపోయిందని.. ఈ ప్రభావం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పడిందని తెలిపారు.

ముంబైకు ప్రస్తుతం 140,000 కోట్ల రూపాయల ఆదాయం కొరత ఏర్పడిందని.. జీఎస్‌డీపీలో 3 శాతం ఉన్న రుణాల పరిమితి ఆధారంగా రుణం తీసుకున్నా 92,000 కోట్లు మాత్రమే వస్తుందని.. అయినా అది కూడా సరిపోదన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని ఆర్థిక ప్యాకేజీ ప్రకటించి మహారాష్ట్రను ఆదుకోవాలని ఆయన సూచించారు. తొందరగా స్పందించకపోతే దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా దీని ప్రభావం పడుతుందని పవార్ హెచ్చరించారు.

Similar News