తమిళనాడులో కరోనా కరోనా రోజురోజుకి విజృంభిస్తుంది. అక్కడి ప్రభుత్వం కరోనా కట్టడిలో కఠిన చర్యలు తీసుకుంటోంది. అయితే, చెన్నైలోని కరోనా చికిత్స పొందుతున్న రోగి రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రి నుంచి పారిపోయారు. పులియంటోప్లోని తన ఇంటి వద్ద కరోనా సోకిన వ్యక్తిని ప్లవర్ బజార్ పోలీసులు గుర్తించారు. కరోనా బాధితుడిని తిరిగి రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.