కరోనా మహ్మమారి ప్రపంచదేశాలను వణికిస్తుంది. ఈ మహమ్మారి మాల్దీవుల్లో కూడా తన పంజా విసిరింది. హిందూమహాసముద్రంలోని ద్వీపదేశమైన మాల్దీవుల్లో కరోనా వైరస్ తొలి మరణం నమోదైంది. దేశ రాజధాని మాలేలో 83 ఏళ్ల మహిళ ఈ వైరస్ బలి తీసుకుంది. దేశంలో ఇప్పటివరకు 280 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ మంత్రి అబ్దుల్లా అమీన్ తెలిపారు.