గుజరాత్ లో కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నాయి. గురువారం ఒక్కరోజే గుజరాత్ లో 313 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రం వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4395 చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారిన పడి 214 మంది ప్రాణాలు కోల్పోయినట్లు గుజరాత్ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. బుధవారం ఒక్క రోజే గుజరాత్ లో 308 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.