ఆర్బీఐ ప్రకటించిన మూడు నెలల ఈఎంఐ మారటోరియం ఇంకా చాలామంది బ్యాంకింగ్ కస్టమర్లలో గందరగోళం నింపుతూనే ఉంది. ఇది ఆప్షనల్ అని.. కావాలంటే ఎంపిక చేసుకోవచ్చని.. లేదంటే మానేయవచ్చని.. రీపేమెంట్ కోసం రెండు రకాల అవకాశాలను కల్పించామని బ్యాంకులు చెబుతున్నాయి.
అయితే ఈ మూడు నెలల కాలానికి వడ్డీ లెక్కింపు ఉంటుందని చెప్పడంతో.. మిగిలిన కాలానికి వారు చెల్లించాల్సిన రుణ మొత్తం పెరగనుందనే విషయాన్ని ఇప్పటికే నిపుణులు చెప్పారు. అయితే.. ఇంకా దీనిపై గందరగోళం కొనసాగుతూనే ఉంది.