ప్రధాని మోడీ శనివారం జాతినుద్దేశించి కీలక ప్రసంగించనున్నారు. లాక్డౌన్ మే3 తో ముగియనుండటంతో.. మరో రెండు వారాల పాటు లాక్డౌన్ను పొడగిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. దీంతో ప్రధాని మోడీ ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. కరోనాపై ఎలా పోరాడాలి.. ఏ ఏ రంగాలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపులు ఉంటాయి అనే అంశాలను మోడీ ప్రస్తావిస్తారని పలువురు అభిప్రాయ పడుతున్నారు.