యూపీలో కరోనా కరాళా నృత్యం చేస్తోంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా కాన్పూర్ లో 14 మందికి పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్ గా తేలింది. వీరిలో 11 మంది పోలీస్ అధికారులున్నారు. దీంతో 14 మందిని ఆస్పత్రికి తరలించి ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నట్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు. ఇప్పటి వరకు కాన్పూర్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 232 కు చేరింది.