ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తోన్న కరోనా వైరస్ బ్రెజిల్లో స్వైర విహారం చేస్తోంది. అక్కడ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ ప్రాణాంతకర కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య బ్రెజిల్లో లక్ష దాటింది. ఇప్పటి వరకు ఆ దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 101,147కు చేరింది. ఈ మహమ్మారి బారిన పడి దేశంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఏడు వేలుకు చేరింది.