దేశ రాజధాని ఢిల్లీలో కరోనా స్వైర విహారం చేస్తోంది. ఢిల్లీలో రోజు రోజుకీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా 384 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4122కు చేరిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్రజైన్ వెల్లడించారు. ఈ కరోనా మహమ్మారి బారిన పడి ఢిల్లీలో ఇప్పటివరకు 64 మంది ప్రాణాలు కోల్పోయారు.