ఇండియాలో 40వేలు దాటిన కరోనా కేసులు

Update: 2020-05-03 21:38 GMT

ఇండియాలో కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తోంది. దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు 40వేలు దాటాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 2487 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి బారిన పడి గడచిన 24 గంటల్లో 83 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం సాయంత్రం వరకు దేశవ్యాప్తంగా మొత్తం కరోనా బాధితుల సంఖ్య 40,263కు చేరింది. ఈ ప్రాణాంతకర వైరస్ కారణంగా ఇప్పటి వరకు 1306 మంది మృతి చెందారు.

Similar News