ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి దాయాది దేశం పాకిస్థాన్ను గజగజ వణికిస్తోంది. పాక్లో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 989 కేసులు నమోదయ్యాయి. దీంతో పాక్లో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 19,103కు చేరింది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 440మంది ప్రాణాలు కోల్పోయినట్లు పాక్ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.