ఢిల్లీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజు రోజుకీ కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఢిల్లీలో పాజిటివ్ కేసుల సంఖ్య 5,000 దాటింది. మంగళవారం కొత్తగా 206 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 5,104కు చేరింది. మొత్తం కేసులలో 1468 మంది బాధితులు వైరస్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారని ఢిల్లీలో ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు.