ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ సింగపూర్పై కూడా పంజా విసిరింది. సింగపూర్ లో రోజు రోజుకీ కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఒక్కరోజులోనే 788 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు దేశంలో మొత్తం వైరస్ బారిన పడిన వారి సంఖ్య 20,198 కి చేరింది.