coronavirus : దేశంలో రికవరీ రేటు పెరిగింది..

Update: 2020-05-05 20:05 GMT

దేశంలో కరోనా వైరస్ సోకిన రోగుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 46,711 కు పెరిగింది. వీరిలో 31,967 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు, మొత్తం 12,727 మంది కోలుకోవడంతో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు.. 1,583 మంది మరణించారు. ఇక దేశవ్యాప్తంగా కూడా రికవరీ రేటు 27.4 శాతానికి పెరగడం ఊరట కల్గిస్తోంది.

Similar News