ఏపీలో మరోసారి స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా

Update: 2020-05-06 20:01 GMT

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మరోసారి నిలిచిపోయింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ ఎస్‌ఈసీ కనగరాజ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. కోర్టులో కేసు ఉండడంతో ఎన్నికలు వాయిదా వేసినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే ప్రారంభమవుతుందని తెలిపారు. గతంలో కరోనా కారణంగా అప్పటి ఎస్‌ఈసీ రమేష్‌కుమార్.. స్థానిక సంస్థల ఎన్నికలను 6 వారాల పాటు వాయిదా వేశారు. ఏప్రిల్‌ 31తో ఎన్నికల వాయిదా గడువు ముగిసింది. దీంతో ఎస్‌ఈసీ కనగరాజ్ మరోసారి నోటిఫికేషన్ విడుదల చేశారు.

Similar News