పాకిస్థాన్‌లో ఒక్కరోజే 1764 కరోనా పాజిటివ్ కేసులు

Update: 2020-05-08 15:06 GMT

దాయాది దేశం పాకిస్థాన్‌లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. పాక్‌లో కరోనా వైరస్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1764 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఈ వైరస్‌ బారిన పడినవారి సంఖ్య 25,837కు చేరింది. అదేవిధంగా ఒక్క రోజు వ్యవధిలో కరోనా మహమ్మారి వల్ల 35 మంది బాధితులు మృతిచెందారని పాక్‌ ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో దేశంలో మొత్తం మృతుల సంఖ్య 594కు చేరింది.

Similar News