అమెరికా అధ్యక్షభవనం వైట్హౌస్లోకి కరోనా వైరస్ కాలు పెట్టింది. అధ్యక్షుడు ట్రంప్ సహాయకుడికి, ఆయన కూతురు ఇవాంక వ్యక్తిగత సహాయకురాలికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో శ్వేతసౌధంలో కరోనా సోకిన వారి సంఖ్య మూడుకు చేరుకుంది. కాగా, బాధితురాలు వైద్యుల పర్యవేక్షణలో ఉండి చికిత్స పొందుతోంది. ఎటువంటి ప్రమాదం లేదని వైద్య వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో ఇవాంక, ఆమె భర్త జారేద్ కుష్పర్కు శుక్రవారం కరోన టెస్ట్ చేశారు. ఫలితాలు నెగిటివ్గా రావడంతో అధ్యక్షభవనం ఊపిరి పీల్చుకుంది. ఈ నేపథ్యంలో ఇక నుంచి తాను రోజూ కరోనా టెస్టులు చేయించుకుంటానని ట్రంప్ పేర్కొన్నారు.