వలస కూలీల సమస్యలపై సీఎం జగన్కు లేఖ రాశామని.. కానీ చర్యలు తీసుకుంటున్నట్లు కనబడడం లేదన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ. వలస కూలీలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. గుంటూరులో బీజేపీ కార్యకర్తలకు కన్నా లక్ష్మీనారాయణ నిత్యావసరాలను పంపిణీ చేశారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు సహాయ చర్యలు చేపట్టామన్నారు.