మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నర్సింగపూర్ జిల్లా పారా వద్ద అర్ధరాత్రి లారీ బోల్తా పడింది. దీంతో ఆ ఘటనలో ఐదుగురు వలస కూలీలు మృతి చెందగా.. 11 మందికి గాయాలయ్యాయి. హైదరాబాదు నుంచి మామిడి పండ్లతో ఆగ్రాకు వెళ్తున్న లారీ ఈ ప్రమాదానికి గురైందని నర్సింగపూర్ జిల్లా కలెక్టర్ దీపక్ సక్సెనా తెలిపారు. మహారాష్ట్ర ఔరంగాబాద్ లో జరిగిన ఘటన మరిచిపోక ముందే మరో ఘటన చోటు చేసుకుంది.