కరోనా మహమ్మారి నుంచి బయటపడాలంటే మరికొన్నాళ్లపాటు పోరాటం చేయక తప్పదన్నారు చినజీయర్ స్వామి. ప్రస్తుతం 3 దశల లాక్డౌన్తోపాటు, కేంద్రం చేపట్టిన చర్యల వల్ల కొంచెం మేలు జరిగిందన్నారు. కరోనా ప్రపంచానికి ఒక గుణపాఠం నేర్పిందని.. ప్రతి ఒక్కరు బాధ్యతగా మెలిగితే ఈ ముప్పు నుంచి బయట పడొచ్చని అన్నారు.