ఒడిశాలో కరోనా ఒక్కసారిగా విజృంభించింది. గడిచిన 24 గంటల్లో 101 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 538కి చేరుకున్నట్టు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. వందకు పైగా కేసులు నమోదవ్వటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పలు రాష్ట్రాల నుంచి స్వరాష్ట్రానికి తిరిగి వచ్చిన వలస కార్మికుల్లో అనేక మందికి కరోనా సోకినట్టు గుర్తించారు.