తెలుగు ప్రజలను ఇద్దరు ముఖ్యమంత్రులు మోసం చేస్తున్నారని ఆరోపించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. సీఎం కేసీఆర్ వ్యవహారం.. పోతిరెడ్డిపాడు విషయంలో ప్రజలను మోసం చేసేలా ఉందని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం 5న జీవో ఇస్తే.. 11 వరకు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు బండి సంజయ్.