మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించిన యూపీ ప్రభుత్వం

Update: 2020-05-16 17:45 GMT

ఉత్తరప్రదేశ్ లో అవురియాలో శనివారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 23 మంది వలస కూలీలు మ‌‌ృతి చెందిన విషయం తెలిసిందే. ఆ మృతులు కుటుంబాలకు యూపీ ప్రభుత్వం 2లక్షలు ఆర్థిక సాయం ప్రకటించింది. అటు గాయపడిన వారికి 50 వేలు సాయం చేయనుంది. దీనిపై సీఎం యోగీ ఆదిత్యానాథ్ ట్వీట్ చేశారు. ఈరోజు జరిగిన దుర్ఘటన చాలా దురదృష్టకరమని అన్నారు. మృతి చెందిన వారకి కుటుంబాలకు ప్రఘాడ సానుభూతి వ్యక్తం చేస్తున్నానని ట్వీట్ చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిచాలని అధికారులకు ఆదేశించాని.. అటు, ఈ ఘటనపై దర్యాప్తుకు కూడా ఆదేశించాని ఆయన ట్వీటర్ వేదికగా తెలిపారు.

కాగా, ఉత్తరప్రదేశ్ లో అవురియా ప్రాంతంగో వలస కార్మికులతో వెళ్తున్న ఓ ట్రక్కును మరో ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 23 మంది మృతి చెందగా.. మరో 20 మందికి తీవ్రగాయలయ్యాయి.

Similar News