జర్నలిస్టుల సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం కృషి చేస్తుంది: పేర్నినాని

Update: 2020-05-16 23:25 GMT

జర్నలిస్టుల సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మంత్రి పేర్ని నాని. రోడ్డు ప్రమాదంలో మరణించిన అప్పటి రాజమహేంద్రవరం టీవీ5 రిపోర్టర్‌ తాతాజీ కుటుంబానికి ప్రభుత్వం తరపున 10 లక్షల చెక్‌ను అందజేశారు. తాతాజీ సతీమణికి ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం కల్పించామని.. వారి కుటుంబ సభ్యులకు అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కరోనా నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టులను ప్రభుత్వం ఆదుకోవాలని మంత్రికి జర్నలిస్టు సంఘాల నేతలు వినతి పత్రం అందజేశారు.

Similar News