కర్నాటకలో కరోనా విస్తరిస్తుంది. సోమవారం సాయంత్రం నుంచి కొత్తగా 127 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు సంఖ్య 1373కి చేరిందని కర్నాటక ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకూ 530 మంది డిశ్చార్జ్ అవ్వగా.. ఇంకా 802మంది చికిత్స పొందుతున్నారని.. ఇప్పటి వరకూ 41 మంది మరణించారని వెల్లడించారు. కర్నాటకలో ఇటీవల ఎక్కువ కేసులు నమోదు కావటం అధికారులకు ఆందోళనకు గురవుతున్నారు.