కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా తెలంగాణలో కూడా లాక్డౌన్ను మే 31 వరకు పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో కంటైన్మెంట్ ఏరియాలు మినహా.. మిగతావన్నీ గ్రీన్జోన్లేనని పేర్కొన్నారు. కేబినెట్ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్ నగరం తప్ప అన్నిచోట్లా అన్ని దుకాణాలు తెరుచుకోవచ్చు అని తెలిపారు. హైదరాబాద్లో జీహెచ్ఎంసీ కమిషనర్ ఎక్కడ దుకాణాలు తెరవాలో ప్రకటిస్తారని కేసీఆర్ పేర్కొన్నారు.