పదిరోజులు చికిత్స అందిస్తే కరోనా తగ్గిపోతుంది: అవంతి శ్రీనివాస్

Update: 2020-05-20 22:09 GMT

కరోనా పాజిటివ్ వచ్చినా ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు మంత్రి అవంతి శ్రీనివాస రావు. పదిరోజులు వైద్యం అందిస్తే తగ్గిపోతుందన్నారు. విశాఖలో జిల్లా అధికారులతో టాస్క్ ఫోర్స్ కమిటీ మీటింగ్ నిర్వహించిన మంత్రి జిల్లాలో కరోనా తీవ్రతపై సమీక్షించారు. జిల్లాలో ఇప్పటివరకు 82 పాజిటివ్ కేసులు రాగా.. వీరిలో 56మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారన్నారు. 25మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు విద్యాసంస్థలు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్ తప్ప మిగిలినవన్ని తీసుకోవచ్చన్నారు.

Similar News