కేసీఆర్ చెప్పినట్టు వింటే.. నీటి వివాదాలు ఉండవు: మైసూరా రెడ్డి

Update: 2020-05-23 16:49 GMT

పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు, రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ఏపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదన్నారు మాజీ ఎంపీ మైసూరారెడ్డి. ఉన్న ప్రాజెక్టులను పూర్తిగా వినియోగించుకుంటే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని ముందు వాటిపై దృష్టి పెట్టాలని సూచించారు. సీఎం జగన్ నిర్ణయాలతో రాయలసీమకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు కాకుండా తెలంగాణ సీఎం చెప్పినట్టు.. గోదావరి నీటిని వాడుకునేందుకు ప్రయత్నం చేస్తే వివాదాలు ఉండవని చెప్పారు. అవసరమైతే మరోసారి రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర నినాదంతో పోరుకు సిద్ధం అవుతామని మైసూరా హెచ్చరించారు.

Similar News