ఏపీ సీఎం వైఎస్ జగన్పై టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఫైరయ్యారు. జగన్కు పాలన చేతకావడం లేదని, అందుకే తరచూ వివాదాలు వస్తున్నాయని విమర్శించారు. రాజకీయ లబ్ది కోసం దేవున్ని కూడా జగన్ వాడుకుంటున్నారని మండిపడ్డారు. టీటీడీ భక్తి, పవిత్రత రెండూ పోయే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. పింక్ డైమండ్పై విచారణ నివేదికను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.