కరోనాను అంతమొందించడానికి ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, దీని ప్రభావం యువత మీద భారీగా పడిందని ఇంటర్నెషన్ లేబర్ ఆర్గనైజేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో ప్రతీ ఆరుగురులో ఒకరు చొప్పున ఉపాధి కోల్పోయారని తెలిపింది. అయితే, ఈ నష్ట్రాన్ని పూడ్చడానికి కొన్ని దశాబ్ధాలు పడుతుందని.. దీంతో యువత భవిష్యత్ పై పెను ప్రభావం చూపిస్తుందని ఐఎల్ఓ చీఫ్ గయ్ రైడర్ వ్యాఖ్యానించారు