మే31తో లాక్డౌన్ ముగుస్తుందడటంతో 5.0పై రాష్ట్రాలు తమ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు అందించాలని కేంద్రం కోరింది. శనివారం లోపు తెలియజేయాలని గడువు విధించింది. ఈమేకరు కేంద్ర కేబినేట్ కార్యదర్శి రాజీవ్ గౌబా.. రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. కరోనాతో పాటు ఆర్ధిక ఇబ్బందులను కూడా అంచానా వేసి తమ అభిప్రాయాలు తెలిజేయాలని అన్నారు. ఈ సమావేశంలో ఆరోగ్య కార్యదర్శులతో పాటు.. కార్పోరేషన్ కమిషనర్లు కూడా పాల్గొన్నారు. ఐదోదశ లాక్డౌన్ ఉన్నా.. లేకున్నా రాష్ట్రాల సలహాలు, సూచనలు కావాలని గౌబా సీఎస్లను ఆదేశించారు.