SEC రమేష్ కుమార్ విషయంలో హైకోర్టు తీర్పు.. జగన్ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదన్నారు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. గవర్నర్ కూడా కళ్లుమూసుకుని ఫైల్పై సంతకం చేశారని.. రాబోయే రోజుల్లో ఆలోచించి ఫైళ్లపై సంతకాలు చేస్తే మంచిదన్నారు. రాష్ట్రాన్ని పాలించడం జైళ్లో ఉన్నంత సులువు కాదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా కక్షసాధింపు చర్యలకు పోకుండా.. అందరి సలహాలు తీసుకుని పాలన సాగించాలని అన్నారు అయ్యన్నపాత్రుడు.