ఏపీ సిఎం జగన్ మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. రేపు ఉదయం 10 గంటలకు ఢిల్లీ వెళ్తున్న ఏపీ సీఎం .. కేంద్ర హోంమంత్రి అమిత్షాను కలవనున్నారు. SEC వ్యవహారం, మండలి రద్దు, వికేంద్రీకరణ బిల్లు సహా.. పలు అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విడుదలపైనా కేంద్రం పెద్దలతో చర్చిస్తారు. అమిత్షా సహా అందుబాటులో ఉన్న కేంద్రమంత్రుల్ని కలిసే అవకాశం ఉంది.