జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ కొత్త వేరియంట్లను మార్కెట్లో ప్రవేశపెట్టింది. జీఎల్ఈ 450 4 మ్యాటిక్ ఎల్డబ్ల్యూబీ, జీఎల్ఈ 400 డీ 4 మ్యాటిక్ ఎల్డబ్ల్యూబీ పేర్లతో రెండు వేరియంట్లను విడుదల చేసింది. వీటికి పెట్రోల్, డీజిల్ ఆప్షన్ ఉంది. ఇక ఈ కార్ల ధర చూస్తే.. రూ. 88.80 లక్షలు నుంచి రూ. 89.90 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. ఈ కార్లు 5.7 సెకన్ల వ్యవధిలో సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని సంస్థ సీఈఓ మార్టిన్ ష్వెంక్ తెలిపారు.