భారత్, చైనా మధ్య సరిహద్దు విషయంలో నెలకొన్న ప్రతిష్టంభనపై చైనా శుక్రవారం స్పందించింది. లద్ధాఖ్ ప్రతిష్టంభనను పరిష్కరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. సరిహద్దు సమస్యలపై శనివారం జరగనున్న మిలటరీ స్థాయి అధికారుల సమావేశానికి చైనా ఒకరోజు ముందు ఈ ప్రకటన చేసింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జెంగ్ షువాంగ్ మాట్లాడుతూ.. భారత్, చైనా సరిహద్దుల్లో పరిస్థితి మాత్రం అదుపులో ఉందని అన్నారు.
మాకు పూర్తి స్థాయిలో సరిహద్దు సంబంధిత యంత్రాగం ఉన్నా.. మిలటరీ, దౌత్యపరమైన మాధ్యమాలున్నా.. ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తూనే ఉన్నాం. సరిహద్దు సమస్యల పరిష్కరించడానికి తాము చిత్తశుద్ధితో పరిష్కరించుకోడానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించారు.