లాక్డౌన్ సమయంలో వందలాది వలస కార్మికులను సొంత ప్రాంతాలకు తరలించి.. యావత్ భారత్ మన్ననలు పొందిన సినీనటుడు సోనూ సూద్పై శివసేన మాత్రం తీవ్రంగా విరుచుకుపడింది. శివసేన అధికారిక పత్రిక సామ్నా వేదికగా పలు ప్రశ్నలు సందించింది. కరోనా సమయంలో వచ్చిన కొత్త మహాత్మడు అంటూ సోనూ సూద్పై వ్వంగ్యాస్త్రాలు సంధించింది. అటు, శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కూడా సోనూ చేసిన సహాయంపై పలు అనుమానాలు వ్యక్తంచేశారు. లాక్డౌన్ సమయంలో లక్షలాది మంది వలస కార్మికులను స్వస్థలాలకు తరలించారని.. అయితే, ఆ సమయంలో అన్ని బస్సులు ఎలా అందుబాటులోకి వచ్చాయని ప్రశ్నించారు. ఇంకా లాక్డౌన్లో ఏ రాష్ట్రంలో కూడా వలస కార్మికులను అనుమతించలేదని.. అయితే, వీరంతా ఎక్కడకు వెళ్లారని ప్రశ్నించారు. ఆయన త్వరలో ప్రధాని మోదీని కలుస్తారని.. సెలబ్రిటీ మేనేజన్ ఆఫ్ ముంబైగా మారిపోతారని సంజయ్ రౌత్ జోస్యం చెప్పారు. ఆయన చేసిన పని చాలా మంచిదని.. దానిని మేము సమర్థిస్తామని.. కానీ, ఆయన వెనుక ఉన్న ఎవరో పొలిటిల్ డైరక్టర్ ఉండే ఉంటారని ఆరోపించారు.