నేపాల్లో ప్రస్తుతం కరోనావైరస్ కేసులు నిలకడగా కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 323 మందికి కరోనా సోకింది. వీరిలో 292 మంది పురుషులు కాగా 31 మంది మహిళలు ఉన్నారు. దీనితో ఇక్కడ అంటువ్యాధుల సంఖ్య 4085 కి చేరుకుంది. ఆ దేశ ఆరోగ్య శాఖ ప్రకారం దేశంలో ఇప్పటివరకు 15 మంది మరణించారు. ఇప్పటివరకు 584 మంది ఆరోగ్యంగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక దేశంలో ఇప్పటివరకూ 1 లక్ష 6 వేల 303 మందికి కరోనా పరీక్షలు చేశారు.మంగళవారం నేపాల్ పిఎం హౌస్ వెలుపల పరీక్ష మరియు దిగ్బంధం కేంద్రాల వద్ద ప్రజలు పెద్దఎత్తున చేరి లాక్డౌన్ ఆంక్షలను సడలించాలని డిమాండ్ చేశారు.