దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతున్నాయి. వరుసగా ఐదోరోజు ధరలు పెరిగాయి. గురువారం లీటర్ పెట్రోలుపై 60 పైసలు, డీజిల్ పై 60 పైసలు చొప్పున పెంచుతున్నట్టు చమురు మార్కెటింగ్ సంస్థలు తెలిపాయి. గత ఐదు రోజుల్లో మొత్తం పెట్రోల్ పై రూ.2.74, డీజిల్పై రూ.2.83లు పెరిగాయి. ఈ రోజు దేశ రాజధానిలో లీటరు పెట్రోలు రూ. 74, లీటరు డీజిల్ 72.22కి పెరిగింది.