భారత్ - చైనా సరిహద్దులో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. లడఖ్లో సరిహద్దులోని గాల్వన్ ప్రాంతంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో చైనా ఆర్మీ జరిపిన కాల్పుల్లో భారత ఆర్మీ అధికారి సహా ఇద్దరు భారత సైనికులు మరణించారని భారత్ ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ఇరువర్గాల సీనియర్ సైనిక అధికారులు అక్కడే సమావేశమవుతున్నారు అని తెలిపింది.