మలయాళీ చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ సినీ దర్శకుడు, స్క్రిప్ట్ రచయిత కె.ఆర్.సచిదానందన్
మృతిచెందారు. ఆయన వయసు 48 ఏళ్ళు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి త్రిస్సూర్లోని ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన ఆర్థోపెడిక్ సమస్యతో బాధపడుతున్నారు. ఆయనకు ఆయనకు హిప్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ జరిగింది.
ఆపరేషన్ తర్వాత గుండెపోటు రావడంతో సచీని త్రిచూర్ హాస్పిటల్కు తరలించారు. వెంటిలేటర్ సహాయంతో చికిత్స పొందుతూ సచిదానందన్ కన్నుమూశారు. సచి మరణ వార్త వెలువడిన తరువాత మలయాళ చిత్ర పరిశ్రమ షాక్ లో మునిగిపోయింది. నటులు పృథ్వీరాజ్ సుకుమారన్, నివిన్ పౌలీ, తోవినో థామస్, దుల్కర్ సల్మాన్ సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేశారు.