భారత్ భూభాగాలైన కాలాపానీ, లిపులేఖ్, లింపియాధూరా ప్రాంతాలను తమ ప్రాంతాలుగా చూపిస్తూ.. విడుదల చేసిన మ్యాప్ను నేపాల్ పార్లమెంట్ ఎగువ సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. మొత్తం 57 మంది సభ్యులూ ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు. అయితే, తరువాత దీనిని రాష్ట్రపతికి పార్లెమెంట్ పంపిస్తుంది. రాష్ట్రపతి దానిని పరిశీలించి ఆమోద ముద్ర వేస్తే.. ఇంకా ఆ మ్యాప్ అమలులోకి వస్తుంది. ఈ బిల్లులను గతవారం నేపాల్ పార్లెమెంట్ దిగువ సభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే, భారత్ భూభాగాలను తమవిగా చూపిస్తూ రూపొందించిన మ్యాప్ విషయంలో భారత్ ప్రభుత్వం తీవ్రంగా మండిపడుతోంది. అయినా.. నేపాల్ ప్రభుత్వం వెనక్కు తగ్గడంలేదు.