దేశంలో కొత్తగా 14,516 కేసులు, 375 మరణాలు

Update: 2020-06-20 12:16 GMT

భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో అత్యధికంగా 14,516 కొత్త కరోనావైరస్ కేసులు, 375 మంది మరణాలు సంభవించినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నివేదించింది. తాజా కేసులతో దేశంలో పాజిటివ్ కరోనావైరస్ కేసుల సంఖ్య ఇప్పుడు 3,95,048 గా ఉంది. భారతదేశంలో ఇప్పుడు 1,68,269 క్రియాశీల కేసులు ఉండగా.. ఇప్పటివరకూ 12,948 మరణాలు సంభవించాయి.

Similar News