రెండో ప్రపంచ యుద్ధ వేడుకలు రష్యాలో ఘనంగా జరిగాయి. సెకండ్ వరల్డ్ వార్లో జర్మనీని ఓడించిన సందర్భాన్ని పురస్కరించుకొని మాస్కోలో ఉత్సవాలు నిర్వహించారు. రెడ్స్క్వేర్లో జరిగిన 75వ విజయోత్సవ పరేడ్ను రష్యా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది. ఈ వేడుకల్లో రష్యా ఆయుధ సంపత్తిని ప్రదర్శించారు. సైనికుల కవాతు ప్రేక్షకులను కట్టిపడేసింది. యుద్ధ ట్యాంకులు కదం తొక్కాయి. వైమానిక దళం అద్భుత ప్రదర్శనతో మెస్మరైజ్ చేసింది.
రష్యా విజయోత్సవ వేడుకల్లో భారత సైన్యం కూడా కదం తొక్కింది. త్రివిధ దళాలకు చెందిన సైనికుల బృందం రెడ్ స్క్వేర్లో కవాతు చేసింది. ఈ వేడుకకు మనదేశం తరఫున రక్షణమంత్రి రాజ్నాధ్సింగ్ హాజరయ్యారు. పరేడ్కు రావడం ఆనందంగా ఉందని రాజ్నాధ్ సింగ్ పేర్కొన్నారు.