అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించిన తెలంగాణ కాంగ్రెస్‌.. పార్టీ ఆఫీస్‌లో మౌన దీక్ష

Update: 2020-06-26 18:41 GMT

చైనా సరిహద్దుల్లో అమరులైన వీరు జవానులకు ఆత్మశాంతి చేకూరాలంటూ, తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించింది. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో.. యాదగిరిగుట్ట కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ బిర్ల ఐలయ్య నాయకత్వంలో.. కాంగ్రెస్‌ శ్రేణులు భారీగా ర్యాలీ నిర్వహించాయి. అమర వీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ ఆఫీస్‌లో మౌన దీక్ష నిర్వహించారు. జవాన్లకు కాంగ్రెస్‌ అండగా ఉంటుందన్నారు

 

Similar News