మిత్రులుగా ఉన్న సరిహద్దు దేశాలు శత్రువులుగా మారాయి: ఉత్తమ్ కుమార్ రెడ్డి
చైనా సరిహద్దుల్లో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు.. తెలంగాణ చరిత్రలో నిలుస్తాడన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్. 45 ఏళ్లుగా ఇండో చైనా సరిహద్దులో ఒక్క ప్రాణం పోలేదన్నారు. కానీ బీజేపీ హయాం లో 20 మంది మృతి చెందారన్నారు. దీన్ని బట్టే మోదీ పని తీరు ఏంటో తెలుస్తుందన్నారు. మోదీ విదేశీయ పర్యటన వల్ల దేశానికి ప్రయోజనం ఎంటో చెప్పాలన్నారు. భారత్తో మిత్రదేశాలుగా ఉన్న సరిహద్దు దేశాలు.. ఇప్పుడు శత్రుదేశాలు గా మారాయన్నారు. విదేశాంగ పాలసీ - విదేశీ రక్షణలో కేంద్రం వైఫల్యం చెందిందన్నారు ఉత్తమ్.