తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం.. జూలై31 వరకూ లాక్‌డౌన్

Update: 2020-06-29 23:33 GMT

తమిళనాడు ప్రభుత్వం కరోనా కట్టడికి కీలక నిర్ణయం తీసుకుంది. రోజురోజుకు కరోనా పెరుగుతుండటంతో లాక్ డౌన్ జూలై31 వరకూ పొడిగిస్తూ.. నిర్ణయం తీసుకుంది. చెన్నై, మధురై నగరాల్లో లాక్ డౌన్ ప్రస్తుతం అమలులో ఉంది. అయినప్పటికీ.. కరోనా కేసులు ఏ మాత్రం తగ్గటంలేదు. దీంతో ఈమేరకు నిర్ణయం తీసుకుంది. ఈ రోజు తమిళనాడులో కొత్తగా 3949 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ నమోదైన రోజువారీ కేసుల్లో ఇవే ఎక్కువ. పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలో జూలై 31వరకు లాక్‌డౌన్ పొడగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

Similar News